Sridhar Babu : HILT పాలసీపై శ్రీధర్ బాబు కౌంటర్
- హిల్ట్పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు
- ఫ్రీహోల్డ్పై బీజేపీ మౌనం ఎందుకు.?
- ప్రభుత్వ భూములపై తప్పుడు ఆరోపణలు
- ఓఆర్ఆర్ అవతల అభివృద్ధి లక్ష్యం : శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Babu : హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య భరిత నగరంగా మారకుండా ఉండేందుకు పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామన్నారు.
“బీఆర్ఎస్ పాలనలో ఫ్రీహోల్డ్ ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హఠాత్తుగా వ్యతిరేకించడం ప్రజలకు అర్థమవుతుంది. మా ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నదే. మున్సిపాలిటీల విలీనాలు కొత్త విషయం కాదు… గతంలోనూ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు అనేక సార్లు జరిగాయి,” అని మంత్రి తెలిపారు.
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
“మా జీవోలో ప్రభుత్వ భూములను లీజు నుంచి ఫ్రీహోల్డ్గా మార్చే అవకాశం లేదు. పట్టాలు ఉన్న వ్యక్తుల సొంత భూములకే కన్వర్షన్ ఫీజు విధించాం. కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవోలు ఇచ్చారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను బదిలీ చేసిన చరిత్ర కూడా వారిదే. హిల్ట్ పాలసీలో మేము ఎస్ఆర్వో రేటు కంటే ఎక్కువ కన్వర్షన్ ఫీజులు పెట్టాం. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం.” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) పాలసీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9,292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వ వాదన. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భూమిని తక్కువ ధరలకు విక్రయించే ప్రయత్నం జరుగుతోందని, మొత్తంగా 5 లక్షల కోట్ల భారీ స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు.
Oxford Word of the Year 2025: ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా Rage Bait.. దీని అర్థం ఏంటంటే?
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..