Harish Rao: అది నిరూపిస్తే నేను రాజీనామాకి సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Slams Congress Government: కాంగ్రెస్ పరిపాలనకు నిన్నటికి రెండేళ్లు పూర్తయింది.. ఒక్క మాట చెప్పాలంటే కాంగ్రెస్ రెండేళ్ల మొండిచేయి చూపెట్టిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. తాజాగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాలన ఆగమాగం ఉందన్నారు. మొదటి రెండేళ్లు పాలన గీటురాయిలా ఉంటుంది.. కానీ ఈ రెండేళ్లు ఏమీ చేయలేదన్నారు. ఈ పాలన నిస్పారం నిరర్ధకం లాగా ఉంది.. మా ప్రభుత్వం రాగానే ఎన్నో కొత్త పథకాలు తెచ్చామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి నూతన పథకాలు తీసుకు వచ్చారు.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు ఇచ్చిన ప్రజా దర్బార్ కూడా అమలు అవడం లేదని విమర్శించారు. రెండేళ్ల లో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ లేదు.. మెట్రో రైలు, ఫార్మా సిటీ లను రద్దు చేశారన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను రద్దు చేయడం తప్ప ఏమి చేయలేదన్నారు. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిందని ఆరోపించారు. విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు. బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులు చేయిస్తున్నారన్నారు.
READ MORE: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో జాబ్స్..
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
మొత్తం రుణమాఫీ అయ్యింది అంటే నేను రాజీనామాకి సిద్ధం! మీరు సిద్ధమా..? అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. “50 రోజులు అయిన మక్కాలు కొన్న పైసలు వేయలేదు.. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ రైతు సంక్షోభ ప్రభుత్వం.. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ మద్యం దుకాణాలను నోటిఫికేషన్ ఇచ్చారు.. తాగుబోతుల తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్ల బిల్స్ క్లియర్ అవుతున్నవి. 18 వేల కోట్ల బిల్స్ ఇచ్చారు.. నేను ఛాలెంజ్ చేస్తున్న.. నేను చర్చకి అయిన సిద్ధం.. గ్లోబల్ సమ్మిట్ కాదు.. అది గోబెల్స్ సమ్మిట్.. థావోస్ లో ఏం జరిగిందో.. మళ్ళీ అదే జరగబోతుంది.. థావోస్ వెళ్ళి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యాడు.. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమిని కేసీఆర్ ప్రభుత్వం సమీకరించింది.. ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 13ఎకరాల సమీకరించిన దానిలో రేవంత్ రెడ్డి చెమట చుక్క లేదు.. ఆయన ఆలోచన లేదు.. యువతకు ఉద్యోగాల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే.. ఆ భూములను తన అనుయాయులకు రేవంత్ రెడ్డి పప్పు బెల్లం మాదిరి పంచిపెడుతున్నాడు.. మొదటి ఏడాది పాలనతో చూస్తే.. రెండో ఏడాది రేవంత్ పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు అయింది.. మూడో ఏడాది పాలన ఏమవుతుందో చూడాలి..” అని హరీష్రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!