Kishan Reddy: భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి రేవంత్ ప్రభుత్వానిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీఆర్ఎస్ కుటుంబ పాలన మన మీద రుద్దింది.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.. తెలంగాణ ప్రజలు తనకు బానిసలుగా ఉండాలని కేసీఆర్ భావించారని ఆరోపించారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. మార్పు కోసం అంటూ అభయ హస్తం అంటూ వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు.. సోనియా, రాహుల్, ప్రియాంకలు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం రాష్ట్రంలో తిరుగుతున్నారు.. రేవంత్ రెడ్డి యే మొఖం పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతున్నావు, ఏమీ నెరవేర్చావో ఎందుకు చెప్పడం లేదు? అని నిలదీశారు.
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ఫ్రీ బస్, సన్న బియ్యం అంటున్నావు.. సన్నబియ్యంలో ఎక్కువ నిధులు కేంద్రానివే అని కిషన్ రెడ్డి తెలిపారు. “రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు సమాధానం చెప్పాలి… ఏ మార్పు వచ్చిందో చెప్పాలి.. గులాబి పోయి చెయ్యి గుర్తు వచ్చింది… కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారు అంతే.. ఏ మార్పు రాలేదు.. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళారు.. కేసీఆర్ హయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRSలో చేరారు.. ఇప్పుడు BRS ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. రాష్ట్రంలో ఇదే పరంపరా కొనసాగుతోంది. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు అయితే ఇందిరా పార్క్ దగ్గర చర్చకు సిద్ధమా? ప్రజా భవన్, ప్రెస్ క్లబ్ అయిన ఓకే.. మా కార్యకర్త ఎవరైనా సిద్ధం.. పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు.. అన్ని వర్గాలను
వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది.. భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి.. లక్ష కోట్లు మద్యం అమ్మకం ద్వారా సంపాదించాలని అనుకుంటుంది.. ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది.. రెండు పార్టీ లు అక్రమాలకు పెద్ద పీట వేసే పార్టీలు… కుటుంబ పార్టీలు, ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు..” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!