CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- కొత్తగూడెంలో డా.మహ్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- థర్మల్ పవర్ ప్లాంట్లో నాన్ తెలంగాణ వ్యక్తుల్ని తీసుకోవడంతో పాల్వంచలో ఉద్యమం రాజుకుంది
- ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట
- ప్రజాపాలనలో భాగంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం
- నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించినవే. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఖమ్మం జిల్లా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీకి అగాధమైన అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది కూడా ఇదే నేలలోనని గుర్తు చేశారు. 1969లో ప్రారంభమైన ఉద్యమం 60 ఏళ్ల పాటు కొనసాగడానికి పాల్వంచ కీలక భూమిక వహించిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర అపారమని పేర్కొన్న సీఎం, అందుకే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకీ ఆయన పేరును పెట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ఖమ్మం జిల్లానే మొదటి అడుగుగా నిలుస్తుందని, ఈ జిల్లాను చూసినప్పుడల్లా తన హృదయం ఉప్పొంగుతుందని రేవంత్ అన్నారు. శ్రీరాముడి సాక్షిగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పేర్కొన్న సీఎం రేవంత్, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ వంటి ప్రముఖ ప్రాజెక్టులు నెహ్రూ పాలనా కాలంలోనే కట్టబడ్డాయని చెప్పారు. గత పదేళ్లలో ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యా రంగం అభివృద్ధి కోసం కూడా ఖమ్మం జిల్లాకు అవకాశాలు ప్రాధాన్యతగా ఇస్తున్నామని రేవంత్ చెప్పారు. పదేండ్లు పాలించిన నాయకులు అవినీతికి పాల్పడడంతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. భట్టి, తుమ్మల, పొంగులేటి వంటి కీలక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్నందున ఖమ్మం జిల్లాకు ఎలాంటి లోటు ఉండదని హామీ ఇచ్చారు.
సర్కార్ తీసుకునే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఖమ్మం జిల్లానే కేంద్రబిందువని, సన్నబియ్యం–రేషన్ పంపిణీ వంటి కీలక పథకాలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు చేసిన ఓటు మంచి పాలనకు మార్గం సుగమం చేస్తుందని, డబ్బు–మందు కోసం ఓటు వేస్తే ఊరే దెబ్బతింటుందని జాగ్రత్తపరిచారు. “మంచోడినే సర్పంచ్గా ఎన్నుకోండి… మీ ఓటే ప్రజాపాలనకు ఆయుధం” అని రేవంత్ పిలుపునిచ్చారు.
Sanyuktha Menon: అఖండ 2 ఛాన్స్ ఎలా దక్కిందో చెప్పిన సంయుక్త.. అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!