Rash Driving Case: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఓ బొలేరో వెహికిల్తో సైరన్ వేసుకుని ర్యాష్ డ్రైవింగ్తో హంగామా చేసిన యువకులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ రోడ్లపై మద్యం మత్తులో ఓవర్స్పీడ్తో వెళ్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ వరకు కారుతోనే ఈడ్చుకుంటూ వెళ్లి… రాక్షసుల్లా ప్రవర్తించారు. అలాంటి ఇద్దరు సైకో గాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొలేరో కారు నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను మహేష్, తరుణ్గా పోలీసులు గుర్తించారు.…
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లికి చెందిన…
Advocate Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్ స్వప్న మర్డర్ సంచలనం సృష్టించింది. భూమి కోసం సొంత అన్ననే ఆమెను అంతమొందించాడు. ప్రస్తుతం అరెస్టై జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఐతే స్వప్న మర్డర్ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్వప్న హత్యని ప్రమాదంలా చిత్రీకరించి చెల్లిని వదిలించుకోవాలనుకున్న సొంత అన్న క్రూరత్వం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది.…
Hyderabad Horror: హైదరాబాద్లో రోజు రోజుకు పోకిరీల అగడాలు శ్రుతి మించుతున్నాయి. రాత్రిపూట రోడ్ల మీద నడవాలన్నా.. వాహనాల్లో వెళ్లాలన్నా సామాన్య జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో పోకిరీ వెధవలు.. సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నారు. సామాన్య జనం.. రోడ్డులో వెళ్తుండగానే పక్కనే రయ్ రయ్ మంటూ బైకుల మీద హడలెత్తించేలా దూసుకు వెళ్లడం, మహిళలను అసభ్యంగా తాకుతూ వెళ్లడం, వంటి పనులతో హైదరాబాద్ సిటీతోపాటు శివారులోనూ పోకిరీలు రెచ్చిపోతున్నారు. ప్రతి…
Jangaon RTC Bus Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి వైద్య బృందాలు. హనుమకొండ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న…
Nizamabad: నిజమాబాద్లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది…
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Charlapally Dead Body: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి..డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా…
కూకట్పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో సహస్రాణి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సహస్ర పేరెంట్స్ రేణుకా, కృష్ణలను విచారిస్తున్నారు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు ఎవరి పైన అయిన అనుమానం ఉందా? Also…