Rash Driving Case: వదలొద్దు ఆ పోకిరీలను.. కుషాయిగూడ రాక్షసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rash Driving Case: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఓ బొలేరో వెహికిల్తో సైరన్ వేసుకుని ర్యాష్ డ్రైవింగ్తో హంగామా చేసిన యువకులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ రోడ్లపై మద్యం మత్తులో ఓవర్స్పీడ్తో వెళ్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ వరకు కారుతోనే ఈడ్చుకుంటూ వెళ్లి… రాక్షసుల్లా ప్రవర్తించారు. అలాంటి ఇద్దరు సైకో గాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొలేరో కారు నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను మహేష్, తరుణ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండటమే కాకుండా… కారును ఓవర్స్పీడ్గా, ర్యాష్గా నడిపినట్లు చెబుతున్నారు పోలీసులు.
READ ALSO: Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించామంటున్నారు. బొలోరో కారుపై తెలంగాణ కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ అని రాసి ఉంది. దీని ఆధారంగానూ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మహేష్ తండ్రి ఈ తెలంగాణ కన్జూమర్ రైట్స్ సెక్రెటరీ వెహికిల్కి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెక్రెటరీ అందుబాటులో లేనప్పుడు మహేష్ తండ్రి ఆ కారును నేరుగా ఇంటికి తీసుకుని వస్తుంటాడు. ఇదే తరహాలో కారును తీసుకొచ్చాడు. ఇంటి వద్ద కారు కనిపించడంతో.. తండ్రికి తెలియకుండా కారు తీసుకుని స్నేహితుడు తరుణ్ తో రోడ్డెక్కాడు మహేష్. ఇద్దరూ మద్యం సేవించి.. కారును స్పీడ్గా నడుపుతూ న్యూసెన్స్ చేశారని.. కారుకి సైరన్ కూడా ఉండటంతో సైరన్ మోగిస్తూ.. స్పీడ్గా వెళ్తూ.. పైశాచికానందం పొందినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ ఇద్దరు యువకులు స్థానికంగా పెయింటర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.
కారు సతీష్ మీదకు ఎక్కడంతో… ఆయన ప్రైవేట్ పార్ట్ నుజ్జునుజ్జు అయ్యింది. కాలు విరిగింది. అప్పటికే వీపంతా చెక్కుకుపోయి.. ఎముకలు బయటకు తేలాయి. తీవ్ర గాయాలపాలైన సతీష్ను వాహనదారులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి పోకిరీలను ఊరికే వదలవద్దని సతీష్ బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప సామాన్యులు రోడ్ల మీద వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!