Rajasaab : రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ.. పాత ధరలకే టికెట్లను అమ్మాలని హైకోర్టు ఆదేశం
- సినిమా టికెట్ల రేట్లు పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
- పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారు..?
- ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా..?
- టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారు
- అయినా టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారు..?
- తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ చిత్రాల విడుదల సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ, న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!
Also Read
- Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
- George Krish : 'జార్జ్ క్రిష్' షూటింగ్కు కౌంట్డౌన్.. హీరోయిన్పై సస్పెన్స్ వీడిందా?
- Varanasi: ఫ్యామిలీ వెకేషన్లో మహేష్ బాబు.. త్వరలోనే ‘వారణాసి’ షూటింగ్లోకి రీఎంట్రీ!
- Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
సినిమా టికెట్ల ధరలను పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. “ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వ ప్లీడర్ను (GP) కోర్టు ప్రశ్నించింది. ప్రజలపై ఆర్థిక భారం పడేలా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. టికెట్ల ధరల పెంపు ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, హైదరాబాద్లో పోలీస్ కమిషనర్కు మాత్రమే ఉంటుంది. కానీ హోంశాఖ కార్యదర్శి నేరుగా మెమోలు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. చట్ట వ్యతిరేకంగా ధరల పెంపును ప్రోత్సహిస్తున్న సదరు అధికారికి 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే.. టికెట్ల పెంపుపై ప్రభుత్వ మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది హైకోర్టు.
Parasakthi Release: శివకార్తికేయన్ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!
తాజావార్తలు
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
-
Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
George Krish : ‘జార్జ్ క్రిష్’ షూటింగ్కు కౌంట్డౌన్.. హీరోయిన్పై సస్పెన్స్ వీడిందా?
ట్రెండింగ్
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!