CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!
- రైతులకు బోనస్తో సాగుకు భరోసా
- రుణమాఫీతో 25 లక్షల మందికి లాభం
- మహిళలకు పాలపిట్ట చీరలు, వడ్డీలేని రుణాలు
- 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు గూడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది కేవలం అధికార మార్పిడి కాదని, పేదవాడి ఆకాంక్షల ప్రతిరూపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యంగా రైతులకు సాగుపై నమ్మకం కలిగించడం , మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
గత ప్రభుత్వ హయాంలో వరి పండించడంపై ఆంక్షలు విధించి రైతులను ఆందోళనకు గురిచేస్తే, ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యం సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల మేర రుణ విముక్తి కలిగించామని, రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కూడా వేగవంతమైందని, అన్నదాతను రాజును చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమం విషయానికి వస్తే, గత ప్రభుత్వం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి భిన్నంగా, నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన ‘పాలపిట్ట’ చీరలను నేయించి ఆడబిడ్డలకు సారెగా అందజేస్తున్నామని చెప్పారు. కేవలం చీరలకే పరిమితం కాకుండా, మహిళా సమాఖ్యల ద్వారా లక్షలాది మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని తెలిపారు. ఇక పేదవాడి సొంతింటి కల విషయానికి వస్తే, 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించే యజ్ఞం మొదలైందని, స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల సహాయం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మార్పు కేవలం ఆరంభమేనని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెజాన్ సేల్లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!