CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!
- రైతులకు బోనస్తో సాగుకు భరోసా
- రుణమాఫీతో 25 లక్షల మందికి లాభం
- మహిళలకు పాలపిట్ట చీరలు, వడ్డీలేని రుణాలు
- 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు గూడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది కేవలం అధికార మార్పిడి కాదని, పేదవాడి ఆకాంక్షల ప్రతిరూపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యంగా రైతులకు సాగుపై నమ్మకం కలిగించడం , మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గత ప్రభుత్వ హయాంలో వరి పండించడంపై ఆంక్షలు విధించి రైతులను ఆందోళనకు గురిచేస్తే, ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యం సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల మేర రుణ విముక్తి కలిగించామని, రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కూడా వేగవంతమైందని, అన్నదాతను రాజును చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమం విషయానికి వస్తే, గత ప్రభుత్వం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి భిన్నంగా, నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన ‘పాలపిట్ట’ చీరలను నేయించి ఆడబిడ్డలకు సారెగా అందజేస్తున్నామని చెప్పారు. కేవలం చీరలకే పరిమితం కాకుండా, మహిళా సమాఖ్యల ద్వారా లక్షలాది మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని తెలిపారు. ఇక పేదవాడి సొంతింటి కల విషయానికి వస్తే, 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించే యజ్ఞం మొదలైందని, స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల సహాయం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మార్పు కేవలం ఆరంభమేనని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెజాన్ సేల్లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!