Medaram 2026 : సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు
- మేడారం జాతరకు భారీ రవాణా ఏర్పాట్లు
- రాష్టవ్యాప్తంగా 4 వేల RTC బస్సుల కేటాయింపు
- భక్తులకు గద్దెల దగ్గరవరకే డైరెక్ట్ బస్సు సదుపాయం
- చిన్నారుల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ ప్రత్యేక చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఒక్క హుస్నాబాద్ డిపో నుండే మేడారానికి 50 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.
IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సురక్షితమైనదని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకు ఒక ప్రత్యేక సౌకర్యం ఉందని మంత్రి వివరించారు. భక్తులు నడక సాగించే అవసరం లేకుండా, నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లగలిగే రవాణా సౌకర్యం కేవలం ప్రభుత్వ బస్సులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలలో రద్దీ , ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రజలు ఆర్టీసీని ఎంచుకోవాలని కోరారు. జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే క్రమంలో చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ , ఆర్టీసీ సంయుక్తంగా ఒక వినూత్న చర్య చేపట్టాయి.
జాతరకు వచ్చే ప్రతి చిన్న బిడ్డ చేతికి పేరు , తల్లిదండ్రుల ఫోన్ నంబర్ నమోదు చేసిన ఒక ప్రత్యేక బ్యాండ్ను కడతారు. ఒకవేళ రద్దీలో పిల్లలు తప్పిపోయినా, ఈ బ్యాండ్ ఆధారంగా వారిని వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి వీలవుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. హుస్నాబాద్ నుండి ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు జాతర ముగిసే వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
T20 World Cup: సొంత ఆటగాళ్లనే మోసం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్..
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!