Medaram 2026 : సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు
- మేడారం జాతరకు భారీ రవాణా ఏర్పాట్లు
- రాష్టవ్యాప్తంగా 4 వేల RTC బస్సుల కేటాయింపు
- భక్తులకు గద్దెల దగ్గరవరకే డైరెక్ట్ బస్సు సదుపాయం
- చిన్నారుల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ ప్రత్యేక చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఒక్క హుస్నాబాద్ డిపో నుండే మేడారానికి 50 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.
IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!
Also Read
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సురక్షితమైనదని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకు ఒక ప్రత్యేక సౌకర్యం ఉందని మంత్రి వివరించారు. భక్తులు నడక సాగించే అవసరం లేకుండా, నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లగలిగే రవాణా సౌకర్యం కేవలం ప్రభుత్వ బస్సులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలలో రద్దీ , ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రజలు ఆర్టీసీని ఎంచుకోవాలని కోరారు. జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే క్రమంలో చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ , ఆర్టీసీ సంయుక్తంగా ఒక వినూత్న చర్య చేపట్టాయి.
జాతరకు వచ్చే ప్రతి చిన్న బిడ్డ చేతికి పేరు , తల్లిదండ్రుల ఫోన్ నంబర్ నమోదు చేసిన ఒక ప్రత్యేక బ్యాండ్ను కడతారు. ఒకవేళ రద్దీలో పిల్లలు తప్పిపోయినా, ఈ బ్యాండ్ ఆధారంగా వారిని వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి వీలవుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. హుస్నాబాద్ నుండి ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు జాతర ముగిసే వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
T20 World Cup: సొంత ఆటగాళ్లనే మోసం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్..
తాజావార్తలు
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!