Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!
- సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- టికెట్ ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం
- పుష్ప-2 తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్ల విషయం ఎవరూ రావద్దని చెప్పా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: చాలా రోజుల తర్వాత హీరో ప్రభాస్ ను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఇది ఇలా ఉండగా.. సినిమా టికెట్ ధరలకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకపోయినా.. తెలంగాణలో మాత్రం సినిమా ధరలతో సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ రావడం కాస్త ఆలస్యం అయ్యింది. అయితే అన్ని అడ్డంకులు ఎదుర్కొని చివరకు శుక్రవారం తెల్లవారుజామున 12 తర్వాత ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇది ఇలా ఉండగా..
The Raja Saab: ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు!
Also Read
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
ప్రభాస్ నటించిన “ది రాజాసాబ్” సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ అనుమతులు ఇచ్చారని న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అలాగే మీరు తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. మంత్రులు స్వయంగా ధరలు పెంచమని చెబుతుంటే, వెనుక నుంచి ఇలాంటి మెమోలు ఎలా వస్తున్నాయని మండిపడింది. ఈ గందరగోళం మధ్య సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
రూ.13 వేలకే 10,000mAh బ్యాటరీ, 6.81 అంగుళాల 1.5K డిస్ప్లే.. Honor X80 స్పెక్స్ ఇవే!
పుష్ప-2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని ముందే చెప్పాను. అలాగే అఖండ 2 సమయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు నన్ను ఎవరూ కలవడం లేదు. పెరిగిన ధరలకు, నాకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనకు పర్మిషన్ ఇచ్చినందుకు తాను చాలా బాధపడ్డానని, ఇంకా గాయపడిన వారి బాబు ట్రీట్మెంట్ కోసం తన సొంత డబ్బులు కూడా ఇచ్చానని, ఆ చేదు అనుభవం వల్లే ఇకపై సినిమా ఇండస్ట్రీ గోలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!