Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో…
స్థానికేతరులైన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అన్నయ్య కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలను మన నియోజకవర్గం నుంచి చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లాలోని చించోలి - బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడు.. లేదా బహిరంగ చర్చకు దా.. వివేక్ కి అతనిపై అతనికే నమ్మకం లేదు.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారితే జనం ఎలా నమ్మతారు.. వివేక్ ఖచ్చితంగా ఓడి పోతారు.. అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అంటూ వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా.. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్ఎస్ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్... జై సత్తన్న నినాదాలతో మొగుళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ దద్దరిల్లింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు..
కూకట్ పల్లి నియోజకవర్గం జనసిన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.