Nadendla Manohar: కూకట్ పల్లిలో ప్రేమ్ కుమార్ ను గెలిపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena MLA Candidate: కూకట్ పల్లి నియోజకవర్గం జనసిన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రేమ్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అయితే, 26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ కూకట్ పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అని ఆయన తెలిపారు.
Read Also: CM KCR: ఇవాళ నాలుగు సభల్లో పాల్గొనున్న కేసీఆర్
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ఇక, తాజాగా కూకట్పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాం.. కానీ అనుకోని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం, మహా నగరంగా మారింది.. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని ఆయన తెలిపారు. వైసీపీ, టీడీపీలు పోటీ నుంచి విరమించుకోవటంతో, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని నాదేండ్ల మనోహర్ అన్నారు.
Read Also: Molestation In Metro: బెంగళూరు మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు.. గోర్లతో రక్కిన రాక్షసుడు
కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను గెలిపించి రెండు రాష్ట్రాలకు ఓ సందేశం ఇవ్వాలని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పబ్లిక్ మీటింగ్ జరగనుందన్నారు. ఈ సభకు అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ మరోక మీటింగ్ కు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 2019 ఎన్నికల తరువాత జగన్ దాష్టిక పరిపాలన చూసి అమరావతి రైతుల కోసం ఢిల్లీకి వెళ్ళాం.. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని నాదేండ్ల మనోహర్ అన్నారు. కూకట్పల్లిలో గాజు గ్లాసు గుర్తును జనంలోకి తీసుకొని వెళ్ళాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!