తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో వ్యాఖ్యానించాడు. వర్షంలో తడుస్తూనే రేవంత్రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు దళితబంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఆరోపించారు. కేసీఆర్ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. ఇప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి…
నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…
తెలంగాణ మైనార్టీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ‘మైనారిటీ గర్జన సభ’ లో ఆ పార్టీ నాయకురాలు గీతా రెడ్డి కామెంట్స్ చేశారు. మోదీ పెద్ద ఫేక్.. కేసీఆర్ అంత కంటే పెద్ద ఫేక్ అని ఆమె విమర్శలు చేశారు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మైనార్టీ మీటింగ్ చూస్తున్నాను. 45 లక్షల మందికి పైగా… ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల మైండ్ సెట్ మారాలి.. మార్పు తీసుకురావాలి…
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న…
టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్…
రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్…
తెలంగాణ ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ధరణిలో పట్టా ఉన్న భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు తూకంలో మోసం జరుగుతుందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. గత ఏడేళ్లలో…