కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై.. మాజీ ఎంపీ మధు యాష్కీ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ కారణమని చురకలు అంటించారు. పార్టీ నిర్ణయం కాదని సమ్మేళనం కి వెళ్ళటం పార్టీని నష్ట పర్చడమేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి సమర్ధిస్తారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని… కానీ పార్టీ…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి…
పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు రేవంత్. ఈ సమయంలో ఆయనకు అసమ్మతి దెబ్బలు గట్టిగానే తగుతున్నాయట. సీనియర్ల సహాయ నిరాకరణతో సభా వేదికలను మార్చుకోక తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఇదే హాట్ టాపిక్. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రేవంత్కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోందా? తెలంగాణ కాంగ్రెస్లో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్కఅన్నట్టుగా వెళ్తున్నారు పీసీసీ చీఫ్. ఈ క్రమంలోనే పార్టీలో సభలు.. సమావేశాల ప్రకటనలపై వివాదాలు…
తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో వ్యాఖ్యానించాడు. వర్షంలో తడుస్తూనే రేవంత్రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు దళితబంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఆరోపించారు. కేసీఆర్ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. ఇప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి…
నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…
తెలంగాణ మైనార్టీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ‘మైనారిటీ గర్జన సభ’ లో ఆ పార్టీ నాయకురాలు గీతా రెడ్డి కామెంట్స్ చేశారు. మోదీ పెద్ద ఫేక్.. కేసీఆర్ అంత కంటే పెద్ద ఫేక్ అని ఆమె విమర్శలు చేశారు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మైనార్టీ మీటింగ్ చూస్తున్నాను. 45 లక్షల మందికి పైగా… ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల మైండ్ సెట్ మారాలి.. మార్పు తీసుకురావాలి…
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న…
టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్…