జింబాబ్వే టూర్లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్మన్ గిల్ మొదటి మ్యాచ్లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్లు టీమిండియా…
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా భారత బ్యాట్స్మెన్లు ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో.. 102 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిందని.. 116 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్ల…
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 115 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది.
భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్లకు యువ జట్టు సిద్ధమైంది. కాసేపట్లో హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ టూర్లో యువ భారత్ బరిలోకి దిగుతుంది. టీమిండియాకు యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్కు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చారు. అభిషేక్ శర్మ, రియాగ్ పరాగ్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ టీ20లో…
AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు…
India vs Zimbabwe : భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్లకు యువ జట్టు సిద్ధమైంది. టీ20 సిరీస్ నేడు జులై 6 ప్రారంభం కానుంది. ఈ టూర్లో యువ భారత్ 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీమిండియాకు యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. గిల్తో పాటు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రింకూ సింగ్, జితేష్ శర్మ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జింబాబ్వేపై వారి ప్రదర్శన ఎలా ఉంటుందనేది…
A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్.. పొట్టి ప్రపంచకప్ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్షో.. భారత…
టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియాకు దేశం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే భారత క్రికెట్ జట్టు విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్తో స్వాగతం పలికారు.
ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి విస్తార ఎయిర్లైన్స్ UK 1845 నెంబర్ ను కేటాయించింది.
బార్బడోస్ గడ్డపై 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈరోజు భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని టీమిండియా సభ్యులు కలిశారు.