Shikhar Dhawan Retirement from international and domestic cricket: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నానని తన అభిమానులకు తెలియజేయడానికి శిఖర్ ధావన్ శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధావన్.. ఆటకు వీడ్కోలు సమయంలో తన కోచ్లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. Ajwain…
టీ20 ప్రపంచకప్ 2024 ముందు బార్బడోస్లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం భారత్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు.
గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర…
ICC World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. అక్కడ మూడు ODIలు, 3 టి20 మ్యాచ్లు ఆడింది. టీ20 సిరీస్లో భారత్ 3-0తో శ్రీలంకను వైట్వాష్ చేసింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు 43 రోజుల విరామం లభించింది. విరామం తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్లు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.…
VVS Laxman Extended his NCA Head: భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించనున్నారు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్తో ముగియనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు అతను ఓ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే., ఈ అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తూ.. ఎన్సీఏ చీఫ్గా తన పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను లక్ష్మణ్ అంగీకరించారు.…
Team India Schedule: జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అసలు విషయం మొదలవుతుంది.…
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో తన తోటి బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు.
టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సెలక్ట్ అయినట్లు క్రిక్ బజ్ (Cricbuzz) తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రికమెండ్ చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.
IND vs BAN Schedule: గత ఏడాది కాలంగా వరుస మ్యాచ్లు ఆడుతున్న భారత ఆటగాళ్లకు భారీగా సెలవులు దొరికాయి. దాదాపుగా 40 రోజుల విశ్రాంతి లభించనుంది. గత కొన్ని నెలలుగా భారీ షెడ్యూల్తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఈ 40 రోజుల విశ్రాంతి భారీ ఉపశమనం కలిగించనుంది. శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలాలకు వెళ్ళిపోయిన ప్లేయర్స్.. కుటుంబంతో కలిసి సరదాగా గడపనున్నారు. విదేశీ టూర్స్ వేసే అవకాశం కూడా ఉంది. ఇటీవల ముగిసిన శ్రీలంక…