Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!
- చెప్పినట్లే మన కెప్టెన్ చేశాడు
- టీమిండియా ముందు మరో రెండు లక్ష్యాలు
- ఐసీసీ కొత్త ఛైర్మన్గా జై షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2024 ముందు బార్బడోస్లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం భారత్ లక్ష్యాలని, ఈ రెండింటినీ రోహిత్ సారథ్యంలోనే సాధించాలని ఆకాంక్షించారు.
సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ… ‘అందరికీ ఒక విషయం గుర్తు చేద్దామనుకుంటున్నా. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మన జాతీయజెండాను బార్బడోస్ వేదిక వద్ద నిలబెడతాడని చెప్పా. చెప్పినట్లే మన కెప్టెన్ చేశాడు. 140 కోట్ల ప్రజల ఆశీర్వాదాలు జట్టుకు ఉన్నాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉన్నాయి. ఆ రెండు భారత జట్టు ముందున్న లక్ష్యాలు. రోహిత్ వాటిని కూడా సాదిస్తాడనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Also Read: బుల్లెట్ప్రూఫ్ ఫార్చ్యూనర్.. డీలర్షిప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ!
‘ఈ ఏడాది అక్టోబర్లో మహిళల టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. భారత జట్టు బాగుంది. తప్పకుండా మనం మరో కప్ కొడతాం. ఎక్సెలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డును మహిళా క్రికెట్ జట్టుతో పాటు 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్ రన్నరప్, 2024 టీ20 ప్రపంచకప్ విజేత అయిన భారత క్రికెటర్లకు అంకితం చేస్తున్నా’ అని జై షా చెప్పారు. ఇక ఐసీసీ కొత్త ఛైర్మన్గా జై షా ఎన్నికవడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 27న నామినేషన్కు చివరి తేదీ. అప్పుడు దీనిపై ఓ స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!