Home
Tdp
Tdp News
-
టీఆర్ఎస్లోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ..?
ఓవైపు టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తుంటే.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. అందులో భాగంగా.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు.. ఎల్. రమణతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది.. రమణకు ఫోన్ చేసిన టీఆర్ఎస్ నేతలు.. పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారట.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఏర్పడిన బీసీ నేత లోటును.. మరో బీసీ నేతను తీసుకు వచ్చి… -
కబడ్డీ పేరుతో కబ్జాలు : విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణం.. అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణమైపోయిందని..కన్నుపడితే కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారని ఫైర్ అయ్యారు. “విశాఖపట్టణం.. అనధికారికంగా ఎంపి విజయసాయిరెడ్డి పట్టణమైపోయింది. కన్నుపడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం. పెదవాల్తేరులోని 190 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతోన్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాలని..ఏ2 రెడ్డి గ్యాంగులు కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని… -
చంద్రబాబుది ఎప్పుడూ ‘దొంగ’ చూపే.. దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు!
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపే అని చురకలు అంటించారు. “బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని పశ్చాతాప పడతారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సిఎం జగన్ గారు ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. 40 ఇయర్స్… -
సిఎం జగన్ నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడింది..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో, వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. కరోనా వస్తే పారాసేటమాల్, బ్లీచింగ్ సరిపోతుందని జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడిందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా హాస్పిటల్స్ కు వెళ్లి పేషంట్లకు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నాలుగు గోడల నుండి బయటకు రావడంలేదని..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రాణాలు… -
ధూళిపాళ్లపై మరో కేసు నమోదు… నిబంధనలు ఉల్లంఘించారని…
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి హోటల్లో మీటింగ్ పెట్టారని ధూళిపాళ్లపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా 20మందితో మీటింగ్ పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ధూళిపాళ్లపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే సంగం డైరీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లను గతంలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ధూళిపాళ్ల బయటకు వచ్చారు. బెయిల్పై వచ్చిన తరువాత, నిబంధనలకు… -
ఆయుర్వేద మందుపై రచ్చ..సోమిరెడ్డిపై ఆనందయ్య విమర్శలు…
మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ… -
సోమిరెడ్డి వ్యాఖ్యలకు కాకాని కౌంటర్.. దమ్ముంటే నిరూపించు… రా.. రా..!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. అయితే, ఇప్పుడు ఆనందయ్య మందు.. రాజకీయ విమర్శలకు దారి తీసింది.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్సైట్లో పెట్టి.. ఆనందయ్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్లగొట్టాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారగా.. సోమిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య మందుకు దళారులుగా… -
లోకేష్, చంద్రబాబు ఏపీలో లేరు కాబట్టే ముందే వర్షాలు.. అడుగుపెడితే అంతే !
టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని.. వారు కరువుకు మారు పేరు అని చురకలు అంటించారు. “తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి. గడచిన రెండేళ్లలాగే ఈ… -
అభ్యర్థులు దొరకని స్థితి నీది…నవ్వులుపాలు కావొద్దు చంద్రబాబు!
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ… -
మాజీ ఎంపి మాగంటి ఇంట విషాదం..
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి చెందారు. ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తాగుడు అలవాటును తప్పించడానికి రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. కానీ వైద్యానికి నిరాకరించిన రవీంద్ర.. ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఓ హోటల్ లో ఉన్నాడు. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణించి.. బ్లడ్…
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..