దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు అయింది. నెల రోజుల క్రితం సంగం డైరీ కేసులో నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ… ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దూళిపాళ్ల. అయితే ఇవాళ.. సంగం డెయిరీలో అవకతవకలు కేసులో A1 ముద్దాయి ధూళిపాళ్ళ నరేంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు ధూళిపాళ్ళ నరేంద్ర విజయవాడలోనే ఉండాలని..విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలుపాలని హై కోర్టు షరతులు పెట్టింది. అంతే కాదు.. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాలని ధూళిపాళ్ళ నరేంద్రను ఆదేశించింది. ఏసీబీ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని.. ధూళిపాళ్లను విచారించాలంటే 24 గంటల ముందు ఏసీబీ నోటీసులు ఇవ్వాలని హైకోర్ట్ పేర్కొంది.