తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, వాగ్వాదం, దాడుల వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, కేసుల పరంపర కూడా కొనసాగుతోంది.. అయితే, కుప్పంలో జరిగిన పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు.. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం…
లక్ష్మీపార్వతి అడిగారనో.. నేను అడిగాననో.. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్నారు కొడాలి నాని.. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు.. తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటారని.. దానికి తొందరెందుకు అని వ్యాఖ్యానించారు.
వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో... ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చగా పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు..
సీఎం వైఎస్ జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అన్నారు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్యగా మండిపడ్డ ఆయన.. ఈ ఘటనకు సీఎం వైఎస్ జగన్, జిల్లా మంత్రి…
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు…
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఏర్పాటుచేశాయి ఆ పార్టీ శ్రేణులు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు, అంతేకాదు దారి పొడువునా వైసీపీ తోరణాలు కట్టారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సహకారంతోనే…
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, పవన్ చేసిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన రోజు నాడు చిరంజీవికి వేదన మిగులుస్తున్నారన్నారు.. కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో.. నారా, నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలో కూడా అర్ధం కావడం లేదన్న ఆయన.. మెగాస్టార్ కుటుంబంలో అమ్ముడిపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నాం..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆరోపణలు గుప్పించారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా… మా వ్యూహాలు మాకు ఉంటాయి.. ఎప్పటికప్పుడూ అవి మారుతూ ఉంటాయి.. మొత్తంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తామంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యింది అంటూ విమర్శలు గుప్పించారు.. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాడిశెట్టి.. అది జనసేన…