Pothula Sunitha: బాబు, పవన్ కలసి పోటీచేసినా డిపాజిట్లు కూడా రావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తర్వాత.. వైసీపీ సర్కార్పై ఆయన చేసిన ఘాటు కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.. ఇక, పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం కూడా.. వైసీపీ నేతలకు పనిపెట్టినట్టు అయ్యింది.. వరుసగా పవన్-బాబును టార్గెట్చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్సీ పోతుల సునీత.. పవన్ కల్యాణ్కు సభ్యత సంస్కారం లేదని.. మహిళలను కించపరిచే విధంగా పవన్ మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. దుర్యోధనుడు, కీచకుడిలాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మహిళల పట్ల తయారయ్యారంటూ ఘాటు కామెంట్లు చేశారు. ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబు నాయుడుతో పవన్ ములాఖాత్ అయ్యారని ఆరోపించిన ఆమె.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ విలన్ అంటూ అభివర్ణించారు. చంద్రబాబు అమరావతి గ్రామాల రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా రావని, 175 స్థానాలు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత.
Read Also: IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు.. ఎవరు ఎక్కడికంటే..?
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం