Dharmana Prasada Rao: ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు.. వారి తరుపున ఎవరు నిలబడ్డారో అందరికీ తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు కారణం అన్నాఉ.. ఒక్కో ఆటోలో పది, 12 మంది ప్రయాణిస్తున్నారు.. ఈ విషయం ప్రజల మైండ్ సెట్ మారాలని సూచించారు.. శ్రీకాకుళం ప్రజల అవసరం కోసం 24 బస్సులు అదనంగా ప్రారంభిస్తున్నాం.. ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.. 1980లో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించాం.. దాంతో, నీరు నిలిచిపోతోంది.. దీనికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
Read Also: Munugode Bypoll : మునుగోడులో బీజేపీ సభ రద్దు.. ప్లాన్ మారింది..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇక, పేదలకు భుముల కేటాయింపులో మా ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందన్నారు మంత్రి ధర్మాన.. ఇళ్ల స్థలం లేని కుటుంబం ఉండకూడదని మా ప్రభుత్వం భావిస్తుందని స్పష్టం చేశారు.. ఇల్లులేని ప్రతివారికీ ఇళ్ల స్థలం కేటాయిస్తున్నాం.. 12000 వేల కోట్ల రూపాయాల డబ్బు పెట్టి భుమి కొని ప్రజలకు ఇచ్చామని వెల్లడించారు.. గతంలో ఒక్క ఎకరా కూడా చంద్రబాబు బీదల కోసం కొన్నిది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అది చంద్రబాబుకు అసహ్యమైన పని అన్నారు.. రాజధాని భూమి ప్రజలకు ఇవ్వకూడదా? రియల్ ఎస్టేట్ చెస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమి అవసరం లేదని శివరామ కృష్ణకమిటీ చెప్పిందని గుర్తుచేసిన ఆయన.. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!