మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.
టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్గా ఫోకస్…
ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని…