Kakarla Suresh: ఎన్నికల శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజా గళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ.. శంఖారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై వస్తున్నారని, ఈ శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు.
వింజమూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు మరియు రాబిన్ శర్మ టీంతో కలిసి వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పంచాయతీ బస్టాండ్, పాత బస్టాండ్ సెంటర్లను పరిశీలించారు. అన్నిటికీ అనువైన స్థలం పంచాయతీ బస్టాండ్ గా నిర్ణయించారు. రోడ్ షో అనంతరం కాన్వాయ్ పైనుండి అక్కడే సభ నిర్వహించేందుకు పెద్దలందరితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్ణయించారు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని.. వీరికి వత్తాసుగా పోలీస్ రెవిన్యూ మరియు ఇతర శాఖల అధికారులందరు నడుస్తున్నారని ఆరోపించారు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం అని.. వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని.. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం చంద్రబాబు ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ స్థలాన్ని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నిర్ణయించారు. ఆ స్థలాన్ని నాయకులందరూ వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, కాకర్ల వెంకట్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి వెంకటేశ్వరరావు, కోడూరు నాగిరెడ్డి, షేక్ మహబూబ్ బాషా, నీలం పెరుమళ్ళ, ఇతర ముఖ్య నేతలు అభిమానులు ఉన్నారు.
Renu Desai: యోధుడిలా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!