Kakarla Suresh: ఎన్నికల శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజా గళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ.. శంఖారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై వస్తున్నారని, ఈ శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు.
వింజమూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు మరియు రాబిన్ శర్మ టీంతో కలిసి వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పంచాయతీ బస్టాండ్, పాత బస్టాండ్ సెంటర్లను పరిశీలించారు. అన్నిటికీ అనువైన స్థలం పంచాయతీ బస్టాండ్ గా నిర్ణయించారు. రోడ్ షో అనంతరం కాన్వాయ్ పైనుండి అక్కడే సభ నిర్వహించేందుకు పెద్దలందరితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్ణయించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని.. వీరికి వత్తాసుగా పోలీస్ రెవిన్యూ మరియు ఇతర శాఖల అధికారులందరు నడుస్తున్నారని ఆరోపించారు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం అని.. వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని.. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం చంద్రబాబు ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ స్థలాన్ని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నిర్ణయించారు. ఆ స్థలాన్ని నాయకులందరూ వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, కాకర్ల వెంకట్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి వెంకటేశ్వరరావు, కోడూరు నాగిరెడ్డి, షేక్ మహబూబ్ బాషా, నీలం పెరుమళ్ళ, ఇతర ముఖ్య నేతలు అభిమానులు ఉన్నారు.
Renu Desai: యోధుడిలా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!