YSRCP: చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అని ప్రకటించారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఇద్దరు నేతలు.. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడడు అని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం.. మేం అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన ఉణికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read Also: Deepak Chahar: సీఎస్కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు అని దుయ్యబట్టారు ఎంపీ రెడ్డప్ప.. వైసీపీని చూసి చంద్రబాబు భయపడి.. డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారన్న ఆయన.. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్లే పాల్గొన్నారు.. కానీ, కుప్పం వాళ్లు లేరని విమర్శించారు. ఇక, వాలంటీర్ల పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అన్నారు. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది.. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం