ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా…
టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్,…
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతూనే వున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కొడాలి నాని తరహాలో హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన వంశీ..చంద్రబాబు నిజమే. నేను విశ్వాసఘాతుకుడనే…అది నీ ఒక్కడికే మాత్రమే. కానీ నువ్వూ… ఇందిరాగాంధీ గారికి, మహానుభావుడు ఎన్ టి ఆర్ , హరికృష్ణ , మీ తోడల్లుడు దగ్గుబాటి, పెద్దలు మోడీ…
టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం వైఎస్ జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ దాడులు జరిగాయి.. ఇక, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇవాళ టీడీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు ఇచ్చారు.. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ…
చంద్రబాబులా కుట్రలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదన్నారు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజా బలంతో జగన్ గెలిచారన్నారు. విశాఖ తగరపువలస రెండో రోజు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న అదరణ చూసి ఓర్వలేక తన తొత్తు అయిన పట్టాభితో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు తానేటి వనిత. రాష్ట్రం లో అలజడి,శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన కామెంట్లు ఎంతటి దుమారం కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనాగ్రహ దీక్షలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగు రోడ్లు కూడలి వద్ద నల్లకండువాల తో వైఎస్సార్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గజపతినగరంలో నాయకులు పెద్ద ఎత్తున జనాగ్రహ దీక్ష చేపట్టారు .…
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన…
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని…
చంద్రబాబు దీక్షకు కౌంటర్గా ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేత జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందన్నారు. పట్టాభి కి మద్దతుగా చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు. మా సంక్షేమ…
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. అబీద్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు. టీడీపీ నాయకుడు…