టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని.. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం అందుకోవడంలో విఫలమయ్యారని.. దాంతో అప్రజాస్వామికంగా, అక్రమంగా ఆర్టికల్ 356 ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.
ఇక, సీఎంపై టీడీపీ నేత బూతులు మాట్లాడారు.. ఆ పార్టీ నేతలు ఏ మాత్రం సంకోచించకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన సాయిరెడ్డి… సీఎం జగన్పై టీడీపీ నేతల దుర్భాషతో ప్రజలు తీవ్రంగా బాధపడ్డారన్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న సీఎంపై చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడి దుర్బాషలాడేవారిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన ఆయన.. టీడీపీ “డర్టీ పాలిటిక్స్”పై ప్రజల ఆగ్రహం ఫలితమే ఆ పార్టీ ఆఫీసులపై దాడులని వ్యాఖ్యానించారు. దాడుల ఫొటోలు చూపి చంద్రబాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ.. దాడులు ఎందుకు జరిగాయన్నదానిపై బాబు సైలెంట్ గా ఉన్నారని.. పట్టాభి చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ నేతలు దుర్బాషలాడుతున్నారు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కుట్రలో భాగంగానే సభ్యత, సంస్కారం లేకుండా బూతులు మాట్లాడుతున్నారని.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
Also Read
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!