Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని వేటాడి వెంటాడి చంపేశారు. పరిగెత్తున్న యువకుడిని ఐదుగురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రగాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మరణించాడు.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. న్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు.
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. తనపై 40 మందికి పైగా దాడి చేసి, అసభ్యంగా ప్రర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ఆర్మీ జవాన్ భార్య ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన వేలూరులో జరిగింది. తనను అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొన్నారు. మా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వమని, బెదిరిస్తున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. శనివారం తనను అర్ధనగ్నంగా చేసి కొట్టారని ఆమె ఆరోపించారు.
Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ భూమి పుత్రడుికి పట్టం కట్టాలి అని అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘర్షణ.. ఉత్తరాది, దక్షిణాది అర్చకుల మధ్య గొడవ.. గత రాత్రి ఆలయంలో హనుమంతు వాహన సేవ.. స్వామివారి నైవేద్యం దోస, వడ పంచుకునే విషయంలో వివాదం.. స్వామినామాలు జపిస్తూనే వాదించుకున్న అర్చకులు
Tamil Nadu: మతాంతర సంబంధాలనికి తల్లిదండ్రులు నో చెప్పడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి(23),విద్యా(21) అనే ఇద్దరు సోదరీమణులు తిరుప్పూర్లోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటికి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు.
తమిళనాడులో ఓ ఘటన కలకలం రేపుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? ఓ మృతదేహంపై అఘోరా పూజలు చేయడం కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
Annamalai: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా.. అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రెజ్లర్లు వారి మద్దతుదారులు కొత్త పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని అనుకున్నారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.