Tamil Nadu Floods: తమిళనాడులో హృదయవిదారక ఘటనలు.. ఇళ్ల ముందే శవాలను కాల్చుతున్న వైనం.
Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
వరదల వల్ల శ్మశాన వాటికలు మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇళ్ల ముందే కాల్చే దుస్థితి ఏర్పడింది. చనిపోయిన వారికి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీని కోసం మొబైల్ శ్మశానవాటికను ఉపయోగిస్తు్న్నారు. ఎల్పీజీ సిలిండర్లు వాడి శవాలను దహనం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షం కారణంగా వివిధ కులాలకు చెందిన వారికి కేటాయించిన 12 శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.
Also Read
Read Also: Ram Charan: బ్రేకింగ్.. సీఎంను కలిసిన రామ్ చరణ్ దంపతులు
శ్మశాన వాటికలు ఇప్పటికీ రెండు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయని తూత్తుకుడి కార్పొరేషన్ నివాసి గణేశన్ తెలిపారు. కొంతమంది తమవారి మృతదేహాలను దహన సంస్కారాల కోసం సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. చాలా మంది ప్రజలు మృతదేహాలను ఖననం చేయడానికి తిరువణ్ణామలై లేదా కోవిల్పట్టికి తరలిస్తున్నారని అన్నారు. నీరు పూర్తిగా తగ్గినప్పటికీ.. మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు అనువుగా ఉండాలంటే మరో 5 నెలలు పడుతుందని గణేశన్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా స్థానికులు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి తాత్కాలిక శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. క్రైస్తవులు తమ బందువుల మృతదేహాలను వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. హిందువులు దహనసంస్కారాల కోసం మొబైల్ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు. తూత్తుకుడితో పాటు తిరునెల్వేలి జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్ని ఎదుర్కొన్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో