Tamilnadu : తమిళనాడులో వర్ష బీభత్సం.. చిక్కుకున్న 800 మంది కోసం 48గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది. ఈ విపత్తు కారణంగా ప్రజల జీవనం కష్టంగా మారింది. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటం స్టేషన్లో రైలు చిక్కుకుంది. ఈ రైలులో దాదాపు 809 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైలులో చిక్కుకున్న ప్రయాణికులను ఖాళీ చేయించడం అతిపెద్ద సవాలుగా మారింది. సోమవారం, రెస్క్యూ టీమ్ రైలు నుండి 300 మందిని సురక్షితంగా బయటకు తీసి పాఠశాలలో ఉంచగా, మిగిలిన 509 మంది ప్రయాణికులను మంగళవారం తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానికులు ప్రయాణికులకు భోజన, పానీయాల ఏర్పాట్లు చేశారు. RPF బృందం ప్రజలకు సహాయం చేస్తూనే ఉంది. వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లు ప్రయాణికుల కోసం ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పై నుండి జారవిడిచాయి. రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు 48 గంటలు చాలా ఇబ్బందిగా మారింది.
Read Also:CM YS Jagan: నేడు వరుస కార్యక్రమాలతో సీఎం జగన్ బిజీ బిజీ
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ప్రయాణికులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహా రెస్క్యూ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రయాణికులను చేరుకోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. రెస్క్యూ వర్కర్లు ఛాతీ లోతు నీటిలో దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి, ఇందులో రెస్క్యూ వర్కర్లు ప్రజలను రక్షించడానికి ఎలా కష్టపడుతున్నారో చూడవచ్చు. నీటిని దాటేందుకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వారికి తాళ్లు అందించారు. వృద్ధులను స్ట్రెచర్లపై తీసుకెళ్లారు. రెస్క్యూ వర్కర్లు తమ చేతుల్లో చిన్న పిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టాలపై నీటిలో నడవడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా మారింది. ప్రయాణికులను చేతులు పట్టుకుని నీటిలో నుంచి బయటకు తీశారు. పాఠశాలలో ఉన్న 300 మంది ప్రయాణికుల్లో 270 మంది ప్రయాణికులు సమీప జిల్లాలకు చెందిన వారేనని చెబుతున్నారు. 30 మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాల నుండి వచ్చారు. మణియాచ్చి రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణీకుల ప్రయాణం కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Read Also:Breakfast: ఉదయం బ్రేక్ఫాస్ట్ ను మానేస్తున్నారా? ఇది వింటే గుండె ఆగిపోతుంది..
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!