టీ20 వరల్డ్కప్ 2026కు ముందు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ను ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. టీ20 ఫార్మాట్లో ఆఫ్ఘన్ జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతోనే డీకేను మెంటర్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టీమ్ ఆర్సీబీకి దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. డీకే భారత్ తరఫున 26…
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్కు పాకిస్థాన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఆడడం లేదని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఏదేమైనా పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత రాజకీయ, క్రీడా వర్గాల్లో…
Pakistan vs ICC: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా భారత్తో జరగాల్సిన తమ టీ20 వరల్డ్కప్ మ్యాచ్ను (ఫిబ్రవరి 15) “బహిష్కరిస్తున్నట్లు” పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి మిగతా అన్ని జట్లతో ఆడేందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్పై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తగా.. ఇప్పుడు అవి మరింత తీవ్రతరం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. తారిక్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తారిక్ బౌలింగ్ చేయడమే…
న్యూజీలాండ్తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్లో వికెట్ కీపింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్ నిర్వర్తించాడు. సిరీస్లోని మొదటి నాలుగు మ్యాచ్లలో కీపర్ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించాడు. చివరి మ్యాచ్లో కిషన్కు అప్పగించడంపై భారత అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సంజూ ఉన్నా కూడా కిషన్ ఎందుకు కీపింగ్ చేశాడు, ఇక సంజూ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత…
భారత టీ20 క్రికెట్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. అనుభవం, యువత, దూకుడు.. ఈ మూడింటి అద్భుత సమ్మేళనంగా భారత జట్టు ఉంది. ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్ను ఒంటిచేత్తో తిప్పేయగల సత్తా ఉన్నవాళ్లే ఈ జాబితాలో ఉండటం విశేషం. టీ20 వరల్డ్కప్ 2026 ముందు ప్రస్తుత జట్టు కాంబినేషన్పై ప్రస్తుతం అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది. 11 మంది మ్యాచ్ విన్నర్స్, భారత గ్రేటెస్ట్ టీ20 జట్టు సిద్ధం అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాప్…
భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిభ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజూ.. అవకాశాలు వచ్చిన ప్రతిసారి వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు న్యూజీలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడమే. 5 మ్యాచ్ల్లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు…
ఐదు టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే…
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు ఐదవ, చివరి మ్యాచ్ లో తలపడుతున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇది సూర్య తన T20 అంతర్జాతీయ కెరీర్లో…
Pat Cummins: ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది.