IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్?.. కానీ 3 కండీషన్స్ పెట్టిన పాకిస్థాన్
- భారత్తో మ్యాచ్పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్..
- ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఖవాజాతో మొహ్సిన్ నఖ్వీ భేటీ..
- నేడు పాక్ ప్రధానితో సమావేశం కానున్న పీసీబీ ఛైర్మన్..
IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై కొంతమంది పీసీబీ అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ, చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఇప్పటికీ సహకరించడం లేదని పేర్కొన్నాయి.
Read Also: Lawyers Fees Hike: కోర్టులో కేంద్రం తరపున వాదించే న్యాయవాదుల ఫీజులు పెంపు.. పూర్తి వివరాలు ఇవే
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
కాగా, ఈ నేపథ్యంలో ఈరోజు ( ఫిబ్రవరి 9న) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మరోసారి సమావేశమై చర్చలు జరపాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించారు. తుది నిర్ణయానికి ముందు ప్రధాని అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది. గత రెండు వారాల్లో ఇది రెండో అధికారిక సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా భారీ మైథలాజికల్ సినిమా ఫిక్స్
ఇదిలా ఉండగా, ఐసీసీతో ప్రతిష్టంభనను ముగించేందుకు పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం లాహోర్లో జరిగిన సమావేశంలో పీసీబీ ఈ డిమాండ్లను ఐసీసీ ముందుంచింది.
* బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం ఇవ్వడం,
* టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ బంగ్లాదేశ్కు పాల్గొనకుండా ఫీజు చెల్లించడం,
* భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు కల్పించాలని తెలిపింది. కాగా, ఈ డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై భారత్- పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉండనుంది.
తాజావార్తలు
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!