IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్?.. కానీ 3 కండీషన్స్ పెట్టిన పాకిస్థాన్
- భారత్తో మ్యాచ్పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్..
- ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఖవాజాతో మొహ్సిన్ నఖ్వీ భేటీ..
- నేడు పాక్ ప్రధానితో సమావేశం కానున్న పీసీబీ ఛైర్మన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై కొంతమంది పీసీబీ అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ, చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఇప్పటికీ సహకరించడం లేదని పేర్కొన్నాయి.
Read Also: Lawyers Fees Hike: కోర్టులో కేంద్రం తరపున వాదించే న్యాయవాదుల ఫీజులు పెంపు.. పూర్తి వివరాలు ఇవే
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కాగా, ఈ నేపథ్యంలో ఈరోజు ( ఫిబ్రవరి 9న) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మరోసారి సమావేశమై చర్చలు జరపాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించారు. తుది నిర్ణయానికి ముందు ప్రధాని అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది. గత రెండు వారాల్లో ఇది రెండో అధికారిక సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా భారీ మైథలాజికల్ సినిమా ఫిక్స్
ఇదిలా ఉండగా, ఐసీసీతో ప్రతిష్టంభనను ముగించేందుకు పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం లాహోర్లో జరిగిన సమావేశంలో పీసీబీ ఈ డిమాండ్లను ఐసీసీ ముందుంచింది.
* బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం ఇవ్వడం,
* టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ బంగ్లాదేశ్కు పాల్గొనకుండా ఫీజు చెల్లించడం,
* భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు కల్పించాలని తెలిపింది. కాగా, ఈ డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై భారత్- పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉండనుంది.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!