Home
T20 World Cup 2021
T20 World Cup 2021 News
-
ఆసక్తి రేపుతున్న కొత్త యాడ్.. పంత్ను టీజింగ్ చేసిన విరాట్ కోహ్లీ
పాకిస్థాన్తో మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా దృష్టి తరువాతి మ్యాచ్పై పడింది. ఈనెల 31న ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సరికొత్త యాడ్ రూపొందించింది. ఈ ప్రకటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టీజింగ్ చేశాడు. కోహ్లీకి పంత్ ఫోన్ చేసి.. ఈ మ్యాచ్లో గెలవాలంటే తనకు కొత్త ఆలోచన వచ్చిందని చెప్తాడు. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో వికెట్ పడిన ప్రతీసారి తాను… -
న్యూజిలాండ్ జట్టుకు షాక్ మీద షాక్
టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా ఫ్రాక్చర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయగా న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ నుంచి అతడిని… -
భారత్పై పాక్ గెలుపు.. రాజస్థాన్ టీచర్ ఉద్యోగం హుష్ కాకి
టీమిండియాపై పాకిస్థాన్ గెలుపు రాజస్థాన్లోని ఓ టీచర్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ ఉదయ్పూర్లోని ప్రైవేట్ స్కూలులో పనిచేసే మహిళా టీచర్ నసీఫా అట్టారీ ‘మేం గెలిచాం’ అంటూ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకుంది. ఈ స్టేటస్ చూసిన పలువురు భారత జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహాలకు లోనయ్యారు. దీంతో కొందరు ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వాళ్లు చర్యలు తీసుకున్నారు. Read Also: ప్రేమ మత్తు..… -
టీ20 ప్రపంచకప్లో ఖాతా తెరిచిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన ఆ జట్టు.. రెండో మ్యాచ్లో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు.… -
పాకిస్థాన్పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని… -
షమీని ట్రోల్స్ చేస్తున్న వారిపై ఒవైసీ స్పందన
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్లో భారత్ ఓటమి చెందడంతో టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్రోల్స్ చేస్తూ బూతులు తిడుతున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మ్యాచ్ అందరూ ఆడితేనే గెలుస్తుందని.. కానీ, కొందరూ కావాలనే షమీని ట్రోల్స్ చేస్తున్నారన్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక్క ముస్లిం ఆటగాడినే టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకనీ ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి దేశంలో ఎంత… -
పాకిస్తాన్ కు ఇలాగే చెప్తారా? ఢిల్లీ సీఎంకు ఆర్జీవీ సూటి ప్రశ్న
పాకిస్తాన్ జట్టు పై ఇండియా గెలిచి ఉంటే ఇలాగే చెబుతారా? అంటూ ఢిల్లీ సీఎంను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాక్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటి ఘోర ఓటమితో 45 ఏళ్ళ పాటు కొనసాగిన రికార్డు చెరిగిపోయింది. దీంతో క్రికెట్ ప్రియులు కోహ్లీ సేన పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్… -
అంచనాలు తలకిందులు.. భారత్కు కాళరాత్రి చూపించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.… -
కోహ్లీపై విమర్శలు.. కిషన్ను కాదని పాండ్యాను తీసుకుంటారా?
పాకిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్లో అతడు రాణించాడు. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత… -
ఆదుకున్న కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13)…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..