ఆదుకున్న కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి.
అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. అతడి వికెట్ను హసన్ అలీ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు, కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించారు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా ఆచితూచి ఆడాడు. జడేజా 13 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం పాండ్యా (11) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరి మూడు ఓవర్లలో భారత్ 37 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరీస్ రవూఫ్1 వికెట్ సాధించారు.
Also Read
తాజావార్తలు
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!