భారత్పై పాక్ గెలుపు.. రాజస్థాన్ టీచర్ ఉద్యోగం హుష్ కాకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాపై పాకిస్థాన్ గెలుపు రాజస్థాన్లోని ఓ టీచర్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ ఉదయ్పూర్లోని ప్రైవేట్ స్కూలులో పనిచేసే మహిళా టీచర్ నసీఫా అట్టారీ ‘మేం గెలిచాం’ అంటూ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకుంది. ఈ స్టేటస్ చూసిన పలువురు భారత జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహాలకు లోనయ్యారు. దీంతో కొందరు ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వాళ్లు చర్యలు తీసుకున్నారు.
Read Also: ప్రేమ మత్తు.. యువతి ఇంటిని తగలబెట్టిన యువకుడు
Also Read
నసీఫా అట్టారీ విజయోత్సవ సంబరాల విషయం తమ దృష్టికి రాగానే స్కూల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాకుండా ఆమెపై అంబామాతా పోలీస్ స్టేషన్లో సెక్షన్ 153 కింద కేసు నమోదైంది. అనంతరం సదరు టీచర్ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని, స్నేహితులతో సంభాషణ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మద్దతు ఇస్తానని చెప్పినందుకే అలా పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. అంతే తప్ప తాను పాకిస్థాన్ దేశానికి మద్దతు ఇవ్వలేదని, తాను భారతీయురాలినేని తెలిపారు. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?