Home
T20 World Cup 2021
T20 World Cup 2021 News
-
టీ20 ప్రపంచకప్: నమీబియాను చిత్తుగా ఓడించిన అఫ్ఘనిస్తాన్
టీ20 ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ రెండో విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం నమీబియాతో జరిగిన మ్యాచ్లో 62 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో అన్ని రంగాల్లో ఆ జట్టు రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 33 బంతులాడిన ఈ భారీకాయుడు 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు.… -
మళ్లీ టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా
టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా… ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ను ఓడిపోయాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. భువనేశ్వర్ స్థానంలో శార్దూల్… -
వామ్మో.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్కు మళ్లీ అతడే అంపైర్..!!
దుబాయ్ వేదికగా కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్లో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం టీమిండియాను భయపెడుతున్నాడు. కొన్నేళ్లుగా టీమిండియా ఆడుతున్న నాకౌట్ మ్యాచ్లలో అతడు నిలబడితే చాలు.. ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమి తథ్యం అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అతడు ఎవరంటే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. Also Read: భారత్-కివీస్… -
భారత్-కివీస్ టీ20 మ్యాచ్లలో అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?
మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు ఈ… -
భారత్ను ఆందోళనకు గురి చేస్తున్న కివీస్ గత రికార్డులు
టీ-20 వరల్డ్కప్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సాయంత్రం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లోచావోరేవో తేల్చుకోనుంది. అయితే గత కివీస్ రికార్డులు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్పై కివీస్దే పైచేయి. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. 2019 వన్డే వరల్డ్కప్… -
స్టోక్స్ మనసులో మాట.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్గా భావించిన గ్రూప్-1లో సెమీస్కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్… -
బంగ్లాదేశ్ను 3 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్… -
ఆస్ట్రేలియా లక్ష్యం 155 పరుగులు
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 35, అసలంక35, భానుక రాజపక్సే 33 రాణించారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్, కమిన్స్, జంపా రెండేసీ వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా గెలవాలంటే 155 పరుగులు చేయాల్సి ఉంది. -
పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటే.. దేశద్రోహం కేసులు: సీఎం యోగి
టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాపై పాకిస్థాన్ గెలవడంతో మనదేశంలో చాలా మంది విజయోత్సవాలు జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకోగా.. మరికొన్ని చోట్ల స్వీట్లు పంచుకున్నారు. దీంతో ఈ వేడుకలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు భారతీయులు ఈ వీడియోలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. క్రికెటర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లు కూడా స్పందించి తమదైన శైలిలో సెటైర్లు వేశారు. Read Also: ఐక్యరాజ్యసమితిలో డైనోసార్…… -
టీ20 ప్రపంచకప్: బంగ్లాదేశ్పై అలవోకగా గెలిచిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్మెన్లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు,…
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!