IND W vs WI W: నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ విజయం, సిరీస్ కైవసం
- చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం
- సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs WI W: వెస్టిండీస్తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టీ20ల సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోనూ విజయమే భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Camera Found in MRI Centre: ఎంఆర్ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
218 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది . చినెల్లే హెన్రీ 16 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలవగా, డియాండ్రా డాటిన్ (25), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22) కూడా మంచి ఇన్నింగ్స్లు ఆడారు. అయినా వారు విజయం సాధించలేకపోయారు. భారత్ తరఫున స్పిన్నర్ రాధా యాదవ్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు రేణుకా సింగ్, సజీవన్ సజ్నా, టిటాస్ సాధు, దీప్తి శర్మలు ఒక్కో వికెట్ సాధించారు.
Also Read: Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
స్మృతి మంధాన వరుసగా మూడవ అర్ధ సెంచరీ, టి20లో రిచా ఘోష్ వేగవంతమైన అర్ధ సెంచరీ కారణంగా టి20లో భారతదేశం అతిపెద్ద స్కోరును నమోదు చేసింది. భారత్ నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇదేఇవరకు UAEపై చేసిన 201 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. స్మృతి మంధాన 30వ T20 అర్ధ సెంచరీని నమోదు చేసింది. దీంతో టీ20లో 50కి పైగా స్కోర్ సాధించిన మహిళా బ్యాట్స్మెన్గా నిలిచింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ (29)ను వెనక్కి నెట్టేసింది. మంధాన 47 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 77 పరుగులు చేయగా, రిచా 21 బంతుల్లో మూడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసింది. రిచా 18 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ పరంగా సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ఫీల్డ్లను సమం చేసింది. తొలి రెండు టీ20ల్లో మంధాన 54, 62 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?