IND W vs WI W: నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ విజయం, సిరీస్ కైవసం
- చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం
- సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs WI W: వెస్టిండీస్తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టీ20ల సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోనూ విజయమే భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Camera Found in MRI Centre: ఎంఆర్ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
218 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది . చినెల్లే హెన్రీ 16 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలవగా, డియాండ్రా డాటిన్ (25), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22) కూడా మంచి ఇన్నింగ్స్లు ఆడారు. అయినా వారు విజయం సాధించలేకపోయారు. భారత్ తరఫున స్పిన్నర్ రాధా యాదవ్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు రేణుకా సింగ్, సజీవన్ సజ్నా, టిటాస్ సాధు, దీప్తి శర్మలు ఒక్కో వికెట్ సాధించారు.
Also Read: Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
స్మృతి మంధాన వరుసగా మూడవ అర్ధ సెంచరీ, టి20లో రిచా ఘోష్ వేగవంతమైన అర్ధ సెంచరీ కారణంగా టి20లో భారతదేశం అతిపెద్ద స్కోరును నమోదు చేసింది. భారత్ నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇదేఇవరకు UAEపై చేసిన 201 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. స్మృతి మంధాన 30వ T20 అర్ధ సెంచరీని నమోదు చేసింది. దీంతో టీ20లో 50కి పైగా స్కోర్ సాధించిన మహిళా బ్యాట్స్మెన్గా నిలిచింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ (29)ను వెనక్కి నెట్టేసింది. మంధాన 47 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 77 పరుగులు చేయగా, రిచా 21 బంతుల్లో మూడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసింది. రిచా 18 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ పరంగా సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ఫీల్డ్లను సమం చేసింది. తొలి రెండు టీ20ల్లో మంధాన 54, 62 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!