IND W vs WI W: నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ విజయం, సిరీస్ కైవసం
- చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం
- సిరీస్ కైవసం
IND W vs WI W: వెస్టిండీస్తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టీ20ల సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోనూ విజయమే భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Camera Found in MRI Centre: ఎంఆర్ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
Also Read
218 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది . చినెల్లే హెన్రీ 16 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలవగా, డియాండ్రా డాటిన్ (25), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22) కూడా మంచి ఇన్నింగ్స్లు ఆడారు. అయినా వారు విజయం సాధించలేకపోయారు. భారత్ తరఫున స్పిన్నర్ రాధా యాదవ్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు రేణుకా సింగ్, సజీవన్ సజ్నా, టిటాస్ సాధు, దీప్తి శర్మలు ఒక్కో వికెట్ సాధించారు.
Also Read: Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
స్మృతి మంధాన వరుసగా మూడవ అర్ధ సెంచరీ, టి20లో రిచా ఘోష్ వేగవంతమైన అర్ధ సెంచరీ కారణంగా టి20లో భారతదేశం అతిపెద్ద స్కోరును నమోదు చేసింది. భారత్ నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇదేఇవరకు UAEపై చేసిన 201 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. స్మృతి మంధాన 30వ T20 అర్ధ సెంచరీని నమోదు చేసింది. దీంతో టీ20లో 50కి పైగా స్కోర్ సాధించిన మహిళా బ్యాట్స్మెన్గా నిలిచింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ (29)ను వెనక్కి నెట్టేసింది. మంధాన 47 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 77 పరుగులు చేయగా, రిచా 21 బంతుల్లో మూడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసింది. రిచా 18 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ పరంగా సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ఫీల్డ్లను సమం చేసింది. తొలి రెండు టీ20ల్లో మంధాన 54, 62 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!