సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య అస్మా మరణపు అంచుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది.
Russia: పలు సంస్థలపై రష్యా ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి రిలీఫ్ కల్పించేందుకు మాస్కో రెడీ అవుతుంది. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు సిరియాలో సోమవారం…
Syrian Rebel Flag: అరబ్ రిపబ్లిక్లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు కూల్చివేశాయి. దీంతో తాజాగా, న్యూఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో రెబల్స్ యొక్క కొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Bashar al-Assad: సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 5 దశాబ్ధాలుగా ఆ దేశంలో అస్సాద్ కుటుంబ పాలన ముగిసింది. ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్టీఎస్) తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇదిలా ఉంటే, బషర్ ఫ్యామిలీలో సహా అతను కూడా రష్యాకు పారిపోయాడు. ఇన్నాళ్లు బషర్కి అండగా ఉన్న ఇరాన్, రష్యాలు తిరుగుబాటుదారుల ముందు తలవంచాయి.
సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకున్నారు. అసద్ పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నారు.
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది" అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన…
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
సిరియాలో తిరుగుబాటు తర్వాత బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం ఇచ్చింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపింది. మాస్కోలో ఉన్నారని రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. "బ్రేకింగ్! అస్సాద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తన స్నేహితులకు ద్రోహం చేయదు. ఇదే రష్యా- యూఎస్ మధ్య…