Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
- సిరియా నుంచి భారత్కు 75మంది భారతీయులు
- జైనాబ్లో చిక్కుకుపోయిన 44 మంది యాత్రికులు
- లెబనాన్కు చేరుకున్న భారతీయ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది” అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
READ MORE: Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
READ MORE:Mokshagnya : రూ.1000కోట్ల డైరెక్టర్ తో బాలయ్య తనయుడు.. ప్లానింగ్ మామూలుగా లేదుగా
భారతీయ పౌరుల కోసం హెల్ప్లైన్ జారీ..
సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్ కూడా), ఈమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యూఎన్ మానవతావాద కార్యకర్తలు సిరియాలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 16 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలో మాత్రమే ఒక మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!