Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
- సిరియా నుంచి భారత్కు 75మంది భారతీయులు
- జైనాబ్లో చిక్కుకుపోయిన 44 మంది యాత్రికులు
- లెబనాన్కు చేరుకున్న భారతీయ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది” అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
READ MORE: Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
READ MORE:Mokshagnya : రూ.1000కోట్ల డైరెక్టర్ తో బాలయ్య తనయుడు.. ప్లానింగ్ మామూలుగా లేదుగా
భారతీయ పౌరుల కోసం హెల్ప్లైన్ జారీ..
సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్ కూడా), ఈమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యూఎన్ మానవతావాద కార్యకర్తలు సిరియాలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 16 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలో మాత్రమే ఒక మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!