Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
- సిరియా నుంచి భారత్కు 75మంది భారతీయులు
- జైనాబ్లో చిక్కుకుపోయిన 44 మంది యాత్రికులు
- లెబనాన్కు చేరుకున్న భారతీయ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది” అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
READ MORE: Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
READ MORE:Mokshagnya : రూ.1000కోట్ల డైరెక్టర్ తో బాలయ్య తనయుడు.. ప్లానింగ్ మామూలుగా లేదుగా
భారతీయ పౌరుల కోసం హెల్ప్లైన్ జారీ..
సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్ కూడా), ఈమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యూఎన్ మానవతావాద కార్యకర్తలు సిరియాలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 16 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలో మాత్రమే ఒక మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
తాజావార్తలు
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..