Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
- సిరియా నుంచి భారత్కు 75మంది భారతీయులు
- జైనాబ్లో చిక్కుకుపోయిన 44 మంది యాత్రికులు
- లెబనాన్కు చేరుకున్న భారతీయ పౌరులు
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది” అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
READ MORE: Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
READ MORE:Mokshagnya : రూ.1000కోట్ల డైరెక్టర్ తో బాలయ్య తనయుడు.. ప్లానింగ్ మామూలుగా లేదుగా
భారతీయ పౌరుల కోసం హెల్ప్లైన్ జారీ..
సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్ కూడా), ఈమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యూఎన్ మానవతావాద కార్యకర్తలు సిరియాలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 16 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలో మాత్రమే ఒక మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!