ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన…
టాలీవుడ్ లో మంచి సినిమాలను వెలికి తీసి తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందు వరుసలో ఉంటుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ట్యాలెంట్ ఉన్న నటులను ఒడిసిపట్టాలన్నా.. వేరే భాషలో హిట్ అయినా సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలన్నా దగ్గుబాటి వారసులకే చెల్లింది. అలానే వెంకటేష్ టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని రీమేక్ లు చేసి హిట్ లు అందుకున్నాడు. ఇక సురేష్ బాబు సైతం వేరే భాషలో సినిమా…
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల…
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం…
‘118’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గుహన్ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్రయోగాత్మక థ్రిల్లర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్ వై’.. దిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం కథగా ఈ సినిమాను తీస్తున్నారు. ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా…
‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్. పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింది. వీరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్ ను వరల్డ్ మ్యూజిక్ డయాస్ పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ మ్యూజిక్…
కీరవాణి కుమారుడు సింహా కోడూరి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించిన సింహా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు. తాజాగా సింహా కోడూరి హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇందులో తమిళ సీనియర్ నటుడు సముతిరకని కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సింహా కెరీర్ లో మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే టైటిల్…
సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సినిమా రంగానికి అనుబంధంగా ఉండే మరో రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ లేట్ ఈజ్ బెటర్ దేన్ నెవ్వర్ అన్నట్టుగా ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షదాయకమే. ఇంతకూ విషయం ఏమిటంటే… మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేశ్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోందట. చిత్ర నిర్మాణం, స్టూడియో నిర్వహణ, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్ మెంట్స్, అవుట్ డోర్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్… ఇలా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోనూ…