Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై కేరళం ప్రభుత్వం ‘యూటర్న్’.. 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించకూడదంటూ.!
Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై మరోమారు దుమారం రేగుతుంది. కేరళంలో ఉన్న ప్రభుత్వం శబరిమల ఆలయ ప్రవేశం అంశంలో తన గత వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతుంది. గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడే దిశగా.. 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించుకుంది.
2018లో మహిళలకు అన్ని వయసుల్లోనూ ప్రవేశం అనుమతించాలని మద్దతు తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు భక్తుల భావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంట్ల సమాచారం. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శుక్రవారం (మార్చి 13) నిర్వహించిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) తీసుకున్న తీర్మానానికి ప్రభుత్వం మద్దతు తెలిపింది. సంప్రదాయాల ప్రకారం మాసిక ధర్మం వచ్చే వయస్సులో ఉన్న (50 ఏళ్లలోపు మహిళలు) ఆలయంలో ప్రవేశించరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి 14లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం అనుమతించబడింది. అయితే ఆ తీర్పుపై పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు ఈ కేసులపై విచారణ జరగనుంది.
Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
శబరిమల అంశంలో ప్రభుత్వ యూటర్న్పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల లాభం కోసం ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుందని పార్టీ నేత కుమ్మణం రాజశేఖరన్ ఆరోపించారు. ఇంతకుముందు ఈ అంశంపై ఆందోళనలు చేసిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా.. CPI-M రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ ఈ నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం కాదని అన్నారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు కేవలం మహిళల ప్రవేశంపై మాత్రమే కాకుండా మత సంప్రదాయాలు, రాజ్యాంగ పరమైన అంశాలపై కూడా ఉన్నాయని ఆయన వివరించారు. భక్తుల భావాలు, చట్టపరమైన అంశాలను సమతుల్యం చేసే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?