Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై కేరళం ప్రభుత్వం ‘యూటర్న్’.. 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించకూడదంటూ.!
Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై మరోమారు దుమారం రేగుతుంది. కేరళంలో ఉన్న ప్రభుత్వం శబరిమల ఆలయ ప్రవేశం అంశంలో తన గత వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతుంది. గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడే దిశగా.. 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించుకుంది.
2018లో మహిళలకు అన్ని వయసుల్లోనూ ప్రవేశం అనుమతించాలని మద్దతు తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు భక్తుల భావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంట్ల సమాచారం. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
శుక్రవారం (మార్చి 13) నిర్వహించిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) తీసుకున్న తీర్మానానికి ప్రభుత్వం మద్దతు తెలిపింది. సంప్రదాయాల ప్రకారం మాసిక ధర్మం వచ్చే వయస్సులో ఉన్న (50 ఏళ్లలోపు మహిళలు) ఆలయంలో ప్రవేశించరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి 14లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం అనుమతించబడింది. అయితే ఆ తీర్పుపై పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు ఈ కేసులపై విచారణ జరగనుంది.
Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
శబరిమల అంశంలో ప్రభుత్వ యూటర్న్పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల లాభం కోసం ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుందని పార్టీ నేత కుమ్మణం రాజశేఖరన్ ఆరోపించారు. ఇంతకుముందు ఈ అంశంపై ఆందోళనలు చేసిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా.. CPI-M రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ ఈ నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం కాదని అన్నారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు కేవలం మహిళల ప్రవేశంపై మాత్రమే కాకుండా మత సంప్రదాయాలు, రాజ్యాంగ పరమైన అంశాలపై కూడా ఉన్నాయని ఆయన వివరించారు. భక్తుల భావాలు, చట్టపరమైన అంశాలను సమతుల్యం చేసే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!