కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.
Delhi Metro: ఢిల్లీ మెట్రో ముందు దూకి ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి బ్లూ లైన్ మెట్రో రైలులోని తిలక్ నగర్ స్టేషన్లో ఆదివారం దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఓ యువకుడు వివాహం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో తండ్రితో గొడవపడి జిల్లెలగూడ సందన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు యువకుడు. మృతుడు నాగరాజు (28) చంపాపేట్ నివాసిగా గుర్తించారు. యువకుడు న్యాయవాది దగ్గర పని చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
Mass Killing: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
బీహార్లోని ఔరంగాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా,…
Family Suicide: పశ్చిమ బెంగాల్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఆదివారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఖర్దా ప్రాంతంలో కుళ్లి పోయిన స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల మృతదేహాలను వారి స్వంత ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు.
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.