Sri Chaitanya College: ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. మేనేజ్మెంట్ పై అనుమానం ఉందన్న పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Chaitanya College: తమ కూతురు చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ వర్ష పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులోనూ బ్రిలియంట్ స్టూడెంట్ అని.. కూతురు వర్ష ఇష్టంతోనే ఈ కాలేజీలో చేర్పించామని తండ్రి వాపోయాడు. బలవంతంగా చదివించాలని తీసుకొని రాలేదని క్లారిటీ ఇచ్చారు. రోజు మాతో ఫోన్లో మాట్లాడేది కానీ.. ఎప్పుడూ కూడా ఇబ్బంది అవుతుందన్న విషయం చెప్పలేదని కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం రోజు కూడా మాతో మాట్లాడిందని, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వర్షం చనిపోయిన సంఘటన జరిగితే.. మాకు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి చెప్పారని ఆవేదన చెందారు. తన కూతురు ఎలా చనిపోయిందో నాకు తెలియాలి? అని డిమాండ్ చేశారు. తన కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని, ఆ అనుమానాలను మేనేజ్మెంట్ నివృత్తి చేయాలని అన్నారు. తన ఇతర డిమాండ్లు ఏవి చేయడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. కాగా.. గతేడాది ఫిబ్రవరిలోనూ ఇదే శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే..
Read also: Bank Holidays: వచ్చే ఏడాదిలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా?
Also Read
హైదరాబాద్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వర్ష బాత్ రూమ్ లో కర్రకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్ష స్వగ్రామం గుండ్ల వ్యాపార గ్రామం. వర్షం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ తన ఇష్టంతోనే చదువుకునేందుకు చేరింది. అయితే ఏమైందో ఏమో కానీ బాత్రూమ్ లో తన చున్నీతోనే వేలాడుతూ కనిపించడం అక్కడున్న విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో యాజమాన్యం హుటా హుటిన అక్కడకు చేరుకుని వర్ష మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాలేజీకి చేరుకుని కేసునమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే వర్షం ఆత్మహత్య సంఘటన 12 గంటలకు జరిగితే.. కుటుంబ సభ్యులకు 2గంటలకు తెలియజేయడం పై పేరెంట్స్ మండిపడుతున్నారు. తమ కూతురు పిరిచికాదని, అసలు ఏం జరిగిందే వివరాలు వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు. గత ఏడాదిలో కూడా ఓ స్టూడెంట్ ఇక్కడే హత్మహత్య చేసుకున్న దాఖలాలు వున్నాయని, ఇప్పుడు మా కూతురు చనిపోవడానికి గల కారణాలు యాజమాన్యం క్లారిటీ ఇవ్వాలని కోరారు. తమకు సమాచారం ఇవ్వకుండా వర్ష డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాపోయారు.
Gidugu Rudraraju: వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం..
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!