రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ(HCU) విద్యార్థి నేత రోహిత్ వేముల క్లోజర్ రిపోర్ట్ను రోహిత్ తల్లి రాధిక వ్యతిరేకిస్తున్నారు. రిపోర్ట్ను పూర్తిగా మార్చేసారని హెచ్సీయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. తాజాగా.. రోహిత్ వేముల తల్లి రాధిక మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల ఎస్సీ కాదు అని పోలీసులు రిపోర్ట్ను హైకోర్టులో సబ్మిట్ చేశారని అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనేనని తెలిపారు. పోలీసులు రోహిత్…
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్కు అనుబంధంగా ఉన్న టాయిలెట్కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
కోచింగ్ ఇనిస్టిట్యూట్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
పెంపుడు కుక్కలతో చాలా మందికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎంత అంటే.. ప్రాణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే.. పెంపుడు కుక్క చనిపోయిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని యమునానగర్ లో చోటు చేసుకుంది. బాలిక మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అనంతరం.. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తెలంగాణలో ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శేరిపల్లి సమీపంలో రమ్య అనే విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దొరగారి పల్లి గ్రామానికి చెందిన ఘటిక తేజస్విని అనే విద్యార్థిని.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో…
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం…
Uttarpradesh : పెళ్లి ఎప్పుడు జరిగినా ఇంట్లో ఎప్పుడూ శాంతి నెలకొనాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అలా జరగదు. చాలా సార్లు, వివాహం తర్వాత వివాదాలు చాలా ఎక్కువ అవుతాయి.