Suicide: ఫ్రొఫెసర్ల వేధింపులు.. హాస్టల్ గదిలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
డెహ్రాడూన్లోని శ్రీ గురురామ్ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్లో డాక్టర్ దివేష్ గార్గ్ (26) పీడియాట్రిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 17న తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఈ ఘటనలో డాక్టర్ ఉత్కర్ష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గార్గ్ మరణానికి సంబంధించి IPC సెక్షన్ 306 కింద పీడియాట్రిక్స్ విభాగం అధిపతి శర్మ, ప్రొఫెసర్లు ఆశిష్ సేథి, బిందు అగర్వాల్ పై కేసు నమోదు చేశారు.
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?
తన కొడుకు అక్టోబర్ 2023లో కాలేజీలో చేరాడని.. కొన్ని రోజుల తర్వాత ఉత్కర్ష్ శర్మ, ఆశిష్ సేథీ, బిందు అగర్వాల్ మరియు మేనేజ్మెంట్ కమిటీ తన కొడుకును వేధించడం మొదలుపెట్టారని మృతుడి తండ్రి తెలిపాడు. 104-డిగ్రీల జ్వరంతో ఉన్న కూడా అతనిని 36 గంటల షిఫ్ట్లలో పని చేసేలా చేసారన్నాడు. ఆ విషయం తన కొడుకు తనతో చెప్పాడని తెలిపాడు. అంతేకాకుండా.. ఉత్కర్ష్ శర్మ తన థీసిస్ని రెండుసార్లు తిరస్కరించాడని, ఉత్తీర్ణత కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. బిందు అగర్వాల్ తన కొడుకును మానసికంగా వేధించిందని మృతుడి తండ్రి ఆరోపించాడు
అయితే.. మే 17న ఉదయం 10 గంటలకు తన కొడుకు ఫోన్ చేసినట్లు తండ్రి చెప్పాడు. ‘నన్ను తీసుకెళ్లండి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అని చెప్పాడన్నాడు. అయితే.. తాము మరుసటి రోజు తనను తీసుకురావడానికి వస్తామని, ఏమీ చేసుకోవద్దని చేప్పినట్లు తండ్రి చెప్పాడు. కానీ.. అదే రోజు రాత్రి తనకు కాల్ వచ్చిందని.. ఉత్కర్ష్ శర్మ అనే వ్యక్తి తన కొడుకును ఎమర్జెన్సీ వార్డులో చేర్చారని రమేష్ గార్గ్ చెప్పాడన్నాడు. రాత్రి 10:40 గంటలకు, తన కొడుకు మృతదేహం మార్చురీలో ఉందని మరో కాల్ వచ్చిందని తెలిపాడు. తన కొడుకు మరణం కుట్ర కోణమేనని తండ్రి ఆరోపించాడు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..