Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Two More Students Died In Kota

Kota: కోట సూసైడ్ ఫ్యాక్టరీగా ఎందుకు మారుతోంది..? మరో ఇద్దరు విద్యార్థులు మృతి

Published Date :April 30, 2024 , 5:34 pm
By Rajesh Veeramalla
Kota: కోట సూసైడ్ ఫ్యాక్టరీగా ఎందుకు మారుతోంది..? మరో ఇద్దరు విద్యార్థులు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలోనే కోచింగ్‌ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోచింగ్‌ల కోసం కోటాకు వస్తుంటారు. వారిలో కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు ఒత్తిడిని తట్టుకోలేక జీవితాలను ముగిస్తున్నారు. మరోవైపు.. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల గణాంకాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి.

కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు చనిపోయారని, మరో ఇద్దరు కొన్ని రోజుల తర్వాత కనిపించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

Also Read

  • Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
  • Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

CM YS Jagan: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

రోజురోజుకూ పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలతో కోట ఆత్మహత్యల కర్మాగారంగా మారుతుంది. సమాచారం ప్రకారం, కోటాలో ప్రతి పది మంది విద్యార్థులలో నలుగురు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కోటాలో సుమారు మూడు వేల ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి, వీటిలో 245 వేల గదులు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం కోటాలో కోచింగ్ పరిశ్రమ విలువ ఐదు వేల కోట్లు.

మంగళవారం కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్న రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన భరత్‌ రాజ్‌పుత్ (20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భరత్ తన మేనల్లుడు రోహిత్‌తో కలిసి పీజీలో ఉండేవాడు. ఇద్దరూ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్‌కు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉదయం రోహిత్ కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చేసరికి గది తలుపులు మూసి లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. భరత్‌ని ఎంత పిలిచినప్పటికీ.. స్పందించకపోవడంతో పీజీ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత గది తలుపులు పగులగొట్టి చూడగా భరత్ లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బెడ్‌షీట్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరోవైపు.. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఒకవైపు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నిందించడం సరికాదని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ అన్నారు. ప్రతి విషయంలోనూ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దోషి కాదని తెలిపారు. కొన్నిసార్లు, విద్యార్థుల తప్పు సహవాసం, ప్రేమలో వైఫల్యం కూడా కారణం కావచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పఠన సామర్థ్యం నుండి ఎక్కువ ఆశిస్తారు. దీంతో ఆ విద్యార్థులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారన్నారు. చాలా సార్లు ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలు అమ్మా నాన్న నీ కోరిక తీర్చలేకపోయా అని సూసైడ్ నోట్ రాస్తున్నారని.. మీరిచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోతున్నారని మంత్రి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • died
  • kota
  • Rajasthan
  • suicide
  • telugu news

తాజావార్తలు

  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

  • Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి

  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్

  • Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!

  • Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions