కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే…
నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతి ... క్యాన్సర్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.…
ఈ మధ్య యువత రీల్స్ మోజులో పడి ఏం చేస్తున్నారో.. వారికే అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కోసమో.. లేదంటే లైకుల కోసమో వెంపర్లాడుతున్నారు. వారి ఆనందం కోసం ఇతరుల్ని కూడా బలి చేస్తున్నారు.
ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్లో చోటుచేసుకుంది.