SI Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో నుంచి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు 108కు ఫోన్ రాగా.. వెంటనే 108 అంబులెన్స్లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Road Accident: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
ఎస్సై శ్రీను ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి అందుకే పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సరిగా నడుచుకునే వారు కాదని సమాచారం.ఎస్సై శ్రీనుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై శ్రీనుకు సహకరించేవారు కాదని, ఆ పోలీస్ స్టేషన్ పోవడంతోనే పని ఒత్తిడి పెరిగిందని ఆయన తల్లి, అత్త వాపోయారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.