Nalgonda Crime: ప్రాణం తీసిన స్నేహితులతో దిగిన ఫోటో.. నమ్మితే నట్టేట ముంచారు..
- నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం ..
- తమతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపు..
- ఇద్దరు యువకులు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని, లేకుంటే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువుపోతుందని కళ్యాణి భయపడింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది.
Read also: Shivani Raja MP: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా
Also Read
ఈ నెల 6న కళ్యాణి తల్లిదండ్రులు తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి వెళ్లి తమ బంధువు మృతి చెందాడని అక్కడకు వెళ్లారు. ఇక తమ్ముడు కూడా కాలేజీకి వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణిని యువకులు వేధించారు. మీరిద్దరూ నాకు స్నేహితులు అందుకే మీ ఇద్దరితో చనువుతోనే ఫోటోలు దిగానని తనకు ఆ ఉద్దేశం లేదని తెలిపింది. అయినా శివ, మధు.. కల్యాని మాటలు పట్టించుకోలేదు. ప్రేమించాలని, మేము చెప్పిన విధంగా చేయాలని లేదంటే మా ఇద్దరితో దిగిన ఫోటో వాట్సప్, ఇస్టాట్రామ్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతచెప్పిన ఈ ఇద్దరు యువకులు వేధించడంతో.. తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
అప్పటికే కళ్యాణి పురుగుల మందు తాగి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చావుకు ఇద్దరు యువకులే కారణమని యువతి చనిపోయే ముందు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే కళ్యాణి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబసభ్యులు గమనించి మధును ఆసుపత్రికి తరలించారు. మధును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్న పోలీసులు.
TG High Court: కమిటీని ఏర్పాటు చేయండి.. వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..