Nalgonda Crime: ప్రాణం తీసిన స్నేహితులతో దిగిన ఫోటో.. నమ్మితే నట్టేట ముంచారు..
- నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం ..
- తమతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపు..
- ఇద్దరు యువకులు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని, లేకుంటే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువుపోతుందని కళ్యాణి భయపడింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది.
Read also: Shivani Raja MP: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఈ నెల 6న కళ్యాణి తల్లిదండ్రులు తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి వెళ్లి తమ బంధువు మృతి చెందాడని అక్కడకు వెళ్లారు. ఇక తమ్ముడు కూడా కాలేజీకి వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణిని యువకులు వేధించారు. మీరిద్దరూ నాకు స్నేహితులు అందుకే మీ ఇద్దరితో చనువుతోనే ఫోటోలు దిగానని తనకు ఆ ఉద్దేశం లేదని తెలిపింది. అయినా శివ, మధు.. కల్యాని మాటలు పట్టించుకోలేదు. ప్రేమించాలని, మేము చెప్పిన విధంగా చేయాలని లేదంటే మా ఇద్దరితో దిగిన ఫోటో వాట్సప్, ఇస్టాట్రామ్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతచెప్పిన ఈ ఇద్దరు యువకులు వేధించడంతో.. తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
అప్పటికే కళ్యాణి పురుగుల మందు తాగి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చావుకు ఇద్దరు యువకులే కారణమని యువతి చనిపోయే ముందు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే కళ్యాణి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబసభ్యులు గమనించి మధును ఆసుపత్రికి తరలించారు. మధును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్న పోలీసులు.
TG High Court: కమిటీని ఏర్పాటు చేయండి.. వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!