Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Young Woman Committed Suicide For Family Honor And Victim Last Statement Before Passed Away

Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..

Published Date :July 11, 2024 , 9:53 pm
By Sudhakar Ravula
  • నల్గొండ జిల్లాలో యువతి ఆత్మహత్య..
  • మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మాడుగులపల్లి పోలీసులు కేసు..
  • కళ్యాణి చికిత్స పొందుతున్న సమయంలో జడ్జి సమక్షంలో మరణ వాంగ్మూలం..
  • కుటుంబం పరువుకోసం వేధింపులు దాచి.. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి..
Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Crime: ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మాడ్గులపల్లి మండలం, చింతలగూడెం గ్రామానికి చెందిన కత్తా కళ్యాణి ఈనెల 6వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. చికిత్స పొందుతూ 9వ తేదీ సాయంత్రం మరణించింది. తన కూతురు కొత్త కళ్యాణి ఆత్మహత్యకు ప్రేమ వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళ్యాణి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కళ్యాణి.. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది.. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కమ్మనబోయిన మధు.. అనే ఇద్దరు యువకులు ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ప్రేమ పేరుతో కళ్యాణిని కొంతకాలంగా వేధించడం మొదలుపెట్టారని తెలుస్తుంది.

Read Also: Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!

ఇక, శివ, మధు ఎవరికి వారే ప్రేమ పేరుతో కళ్యాణి వెంట పడటంతోపాటు.. తమను ప్రేమించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. కళ్యాణి ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలుస్తుంది.. ఊరు నుంచి కాలేజీకీ వెళ్లినా, హాస్టల్ వెళ్లినా, ఎక్కడైనా ఉద్యోగం చేసినా తమ నుండి ఫోన్ లు, మెసేజ్ లు వస్తాయని, మీ కుటుంబానికి పరువు లేకుండా చేస్తామని బెదిరించారట.. ఇటీవల కళ్యాణికి వచ్చిన పెళ్లి సంబంధం కూడా తప్పిపోవడానికి వీరిద్దరూ కారణం అనే చర్చ గ్రామంలో జరుగుతుంది. ఈనెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో విడివిడిగా ఫోన్ చేసిన శివ, మధులు కళ్యాణితో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు, బ్లాక్ మైల్ కు పాల్పడినట్లు తెలుస్తుంది.. దీంతో వీరి వేధింపులు భరించలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. పురుగుల మందు తాగిన విషయాన్ని ఆమెనే స్వయంగా తల్లిదండ్రులకు చెప్పింది.. ఆ తర్వాత కళ్యాణిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మేరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స పొందిన అనంతరం కళ్యాణి 9వ తేదీన మృతి చెందింది.

Read Also: Ford Capri EV: సరికొత్త లుక్ లో ఫోర్డ్ కాప్రీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ

మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మాడుగులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కళ్యాణ మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన శివ, మధులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని మృతరాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై మృతదేహంతో నిరసనకు దిగారు. మృతురాలు కళ్యాణి చికిత్స పొందుతున్న సమయంలో జడ్జి సమక్షంలో మరణ వాంగ్మూలం ఇచ్చిందని.. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని పోలీసులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు.. కళ్యాణి మరణవాగ్మూలంలో తన పేరు చెప్పిందని తెలియడంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొలుకుంటున్నాడు.. తన కూతురు ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా వేధింపుల విషయం తమ దృష్టికి తీసుకురాలేదని తల్లి చెప్తుంది.. జడ్జి వచ్చేంత వరకు తమ గ్రామానికే చెందిన ఇద్దరు యువకుల వేధింపులే తన కూతురు ఆత్మహత్యకు కారణం అనే విషయం తమకు తెలియదని.. కేవలం శివ, మధుల వేధింపులతో తమ కుటుంబం పరువు పోతుందనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Family Honor
  • suicide
  • telangana
  • Victim Last Statement
  • Young Woman

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions