Su-57 fighter Jet: ఆపరేషన్ సిందూర్ తర్వాత మన ‘‘ఎయిర్ పవర్’’ ఏంటో పాకిస్తాన్కు అర్థమైంది. భవిష్యత్ సంఘర్షణల్లో ఎయిర్ఫోర్స్ కీలకమనేది స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. శత్రువులతో యుద్ధం మాత్రమే కాకుండా, శత్రు రాడార్లకు దొరకకుండా దాడి చేసే ‘‘5వ తరం యుద్ధ విమానాల’’ కొనుగోలుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రష్యా తయారీ సుఖోయ్ సు -57ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Su-57 fighter jets: భారతదేశానికి, మిత్రదేశం రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా తన ఐదో తరం, స్టెల్త్ ఫైటర్ Su-57 విమానాలను భారత్కు ఆఫర్ చేసింది. మేరకు ఆ దేశ వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం, ఐదో తరం యుద్ధ విమానాలు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్, చైనా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్కు ఫిఫ్ట్ జనరేషన్…
India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది.
India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్ని కాళ్ల బేరానికి తెచ్చాయి.